2019 మార్చి-మే నెలల మధ్య ఆంధ్రభూమి దినపత్రికలో, వుప్పల నరసింహం అనే రచయిత, బౌద్ధాన్ని విమర్శిస్తూ వరుసగా పదిహేను వ్యాసాలు రాశారు. మరికొన్ని పత్రికల్లో కూడ ఆయన ఇటువంటి వ్యాసాలు రాశారు, ఇంకా రాస్తున్నారు. ఈ వ్యాసాల్లో, బుద్ధుని జీవితం మరియు ఆయన బోధించిన ధర్మం గురించి, బుద్ధుని కాలం నుండి నేటి వరకు ఆ ధర్మాన్ని అనుసరించిన వారి గురించి, సదరు ధర్మాచరణ వల్ల కలిగిన ఫలితాల గురించి రచయిత నిశితమైన విమర్శలు చేశారు. ఆ వ్యాసాలలో కొన్ని క్రింద ఉన్న లింక్స్ క్లిక్ చేసి చూడవచ్చు.